పాలెం వాగు ప్రాజెక్టు కాలువ పనులను త్వరగతిన పూర్తి చేయాలి
– జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలెం వాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ నిర్మాణ పనులను బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ వెంకటాపూర్ పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో త్వరిత గతిన పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన గడువు లోపు పనులను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని, నిర్మాణం పనుల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ ఈ సాయి ప్రసాద్, కాంట్రాక్టర్లు, ఆయా సంబంధిత అధికారులు ఉన్నారు.