కుటుంబ వివాదంలో ఒకరికి జైలు శిక్ష, జరిమాన
తెలంగాణజ్యోతి,జూన్20,కన్నాయిగూడెం : కన్నాయిగూడెం మండలంలోని బుట్టయిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి చిన్న వెంకటయ్యకు కుటుంబ కలహం కేసులో కోర్టు 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది.వివరాల్లోకి వెళ్తే.. 2022 నవంబర్లో వృద్ధ తల్లి కుమ్మరి ఎర్ర మల్లక్కను బాగోగులు చూసే విషయంలో కుమారులైన కుమ్మరి దుర్గయ్య, చిన్న వెంకటయ్యల మధ్య గొడవ జరిగింది. గొడవలో వెంకటయ్య అన్న దుర్గయ్యపై దాడి చేయడంతో దుర్గయ్య మనోవేదనకు గురై పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దుర్గయ్య భార్య మాణిక్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం గురువారం కోర్టు చిన్న వెంకటయ్యకు శిక్ష విధించింది. ఈ కేసు విచారణలో ఐవో సురేష్, ప్రస్తుత ఎస్ఐ వెంకటేష్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ ప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ కె. మౌనికలు వారి ప్రతిభను చూపారు.