ములుగులో ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశం
– మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సమావేశం నిర్వహణ
ములుగు ప్రతినిధి, జూన్17, తెలంగాణజ్యోతి : పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకుల కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెస్పీ ములుగు జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యామ్ మాదిగ అధ్యక్షత వహించారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ చాతాళ్ల రమేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తడుగుల విజయ్ మాదిగ, ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాల ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో మాదిగలకు సాధించిన హక్కులు, పొందిన లబ్ధిలు, సమాజానికి అందించిన సేవలపై సమగ్ర చర్చ జరిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై చర్చ నిర్వహించారు. 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో గ్రామస్థాయిలో దండోరాలు వేసి, జెండా గద్దెలను ఏర్పాటు చేసి, జెండా ఆవిష్కరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జిల్లానాయకులు దేవేందర్, వచ్చే సమ్మయ్య, ప్రభు చిత్తం, నక్కరాజు, పెండాల సురేందర్, దూడపాక రాజేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.