కాటారంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

కాటారంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

కాటారంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

కాటారం, తెలంగాణ జ్యోతి : కాటారం, గారెపల్లి, ధన్వాడ గ్రామాలలో బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రి శ్రీధర్ బాబును కలిసి సమస్యల పరిష్కారం కోసం విజ్ఞప్తి చేశారు. కాటారం మాజీ ఉపసర్పంచ్ నాయని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు కాటారంలో ఘనంగా జరిగాయి.ఈవేడుకలలో ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో నాయని శ్రీనివాస్ కేక్ కట్ చేసారు , మంత్రి శ్రీధర్ బాబు శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ తినిపించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమూ నూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మహిళా మండల అధ్యక్షురాలు జాడి మహేశ్వరీ యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గోన్నారు. గారెపల్లి లో అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో తోట సదయ్య కూతురు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిం చారు. గారెపల్లి గ్రామానికి చెందిన చీమల రమేష్ ఇటీవలే గుండెపోటుతో మరణించగా దశదినకర్మ రోజున పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment