వెంకటాపూర్ ఈజీఎస్ ఏపీఓగా మాలోతు రాజు
వెంకటాపూర్, జూన్ 16, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలానికి మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీవోగా మాలోతు రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా ఏపీవో మాలోతు రాజు మాట్లాడు తూ వెంకటాపూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీలో గల ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు గ్రామాలలో ఉపాధి శ్రామికులకు అందుబాటులో ఉంటూ పనులు చేయించాలని అన్నారు. ఇంతకు ముందు ఉన్న ఏపీవో సునీత మల్లంపల్లి మండలానికి బదిలీ పై వెళ్లారు. ములుగు నుండి వెంకటాపూర్ కు బదిలీపై వచ్చానన్నారు. గ్రామాల్లో ఉపాధి శ్రామికులు వంద రోజులు పనులను చేసి పూర్తి చేసుకోవాలని తెలిపారు.