కుసుమ జగదీష్ పేరుమీద మల్లంపల్లి మండలం

Jd Mallampalli | కుసుమ జగదీష్ పేరుమీద మల్లంపల్లి మండలం

– పేరు మార్చుతూ ప్రైమరీ నోటీస్ వెలువరించిన ప్రభుత్వం

ములుగు ప్రతినిధి, మే 31, తెలంగాణ జ్యోతి : ములుగు మాజీ జడ్పీ చైర్ పర్సన్, బీఆర్ఎస్ నేత గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన సొంతూరు మల్లంపల్లి కాగా స్థానిక ప్రజల విజ్క్షప్తి మేరకు రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో రాష్ట్ర ప్రభుత్వం మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా మార్చుతూ ఉత్తర్వులు వెలువరించింది. ఈమేరకు శనివారం ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ జిల్లాల నిర్మాణం చట్టం 7/1974 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ విషయంపై ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు గానె జిల్లా గెజిట్ ప్రాథమిక నోటిఫికేషన్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ను ఆదేశించారు. మల్లంపల్లి మండలం కోసం ఉద్యమం చేపట్టిన మండల సాధన సమితి నాయకులు జేడీ పేరున మండలం ఏర్పాటు కావడంతో సంబురాలు జరుపుకున్నారు. కుసుమ జగదీశ్ ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అని, ఆయన పేరున మండలం ఏర్పాటు చేయడంపట్ల మంత్రి సీతక్కకు కృతజ్క్షతలు తెలిపారు.

కుసుమ జగదీష్ పేరుమీద మల్లంపల్లి మండలం

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment