వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

కాటారం, తెలంగాణ జ్యోతి : కాలేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కాలేశ్వరం పుష్కరాల కోసం వచ్చే అన్ని వర్గాల ప్రజలకు అన్నదానం సౌకర్యం కల్పించాలని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్ణయించింది. వైశ్య సమాజం శ్రేయస్సు కోసం ఏర్పడిన ఈ సంస్థ అన్ని వర్గాల ప్రజలకు వివిధ రకాలుగా సహాయం అందిస్తోంది. అన్ని దానాలలో కంటే అన్నదానం మిన్న అనే నినాదంకు అనుగు ణంగా అన్నదానం చేయాలని నిర్ణయించి పెద్ద ఎత్తున వైశ్యుల నుండి మాత్రమే విరాళాలు స్వీకరించారు. పుష్కరాల స్నానానికి వచ్చే అందరి అన్ని వర్గాల భక్తులకు ఉద్యోగులకు,సరస్వతి పుష్కర భక్తుల కోసం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన శిబిరం ను పుష్కరాల ప్రారంభం రోజున ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. గురువారం సుమారు 8 వేల మందికి గురువారం అన్నదానం నిర్వహించినట్లు పుష్కర కమిటీ చైర్మన్ పవిత్రం శ్రీనివాస్ తెలిపారు. గురువారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నం రాంబాబు అన్నదానం శిబిరంలో సందర్శించారు కార్యక్రమంలో వాసవి క్లబ్ నాయకులు రేణికుంట్ల శ్రీనివాస్, కటకం హరీష్ గవర్నర్ ఇల్లెందుల కిషోర్, దొంతుల రాజేష్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment