గణేష్ నవరాత్రులలో మహా అన్నదానం
ములుగు, సెప్టెంబర్ 3, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో కొలువుదీరిన గణనాయకుని నవరాత్రి ఉత్సవాలలో 7వ రోజు మంగళవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు నరేందర్ గణపతికి కుంకుమపూజ, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం కనుకుంట్ల శ్రీలత-మల్లేష్, కూరపాటి కవిత-నరేష్ దంపతులు దాతలుగా ముందుకు వచ్చి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పౌడాల ఓం ప్రకాష్, నాంపల్లి రాజు, కొండి మహిపాల్, చిందం చందు, స్నేహిత్, నామాల సాయి, మండ సిద్దు, అభిలాష్, హర్షవర్ధన్ లతో పాటు కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.