రైతుల భూముల మ్యాపింగ్ కోసం భూముల రీసర్వే

రైతుల భూముల మ్యాపింగ్ కోసం భూముల రీసర్వే

రైతుల భూముల మ్యాపింగ్ కోసం భూముల రీసర్వే

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : రైతుల భూకమతాల చిత్రపటం కోసం భూముల రీ సర్వేను గురువారం ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని నూగూరు (జీ) లో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భూకమతాల చిత్రపటం కోసం భూముల రీ సర్వే కార్యక్రమానికి ఐదు ప్రాంతాల ఎంపికలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు జీ.ని ఎంపిక చేసింది. రీసర్వే కార్యక్రమాన్ని ఒక ప్రైవేటు సర్వే సంస్థకు అప్పగించింది. ఈ సర్వే కేవలం డెమో, నమూనా కోసమేనని ఆయా భూకమతాల రైతులు తమ సరిహద్దుల వద్ద ఉండి సర్వే టీం కు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈనెల 22వ తేదీన అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ మహేందర్. జి బీసీ మర్రిగూడెం పంచాయతీ ఆఫీస్ వద్ద రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం రీ సర్వే సంస్థ, రెవెన్యూ అధికారులు, డ్రోన్ ద్వారా సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా భూముల సరిహద్దులు, సర్వే నెంబర్లు అక్షాంశాలు, రేఖాంశాలు డెమో, నమూనాగా, రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలి పారు.ఇందులో భాగంగా కంకల వాగు వద్ద నుండి డ్రోన్ ద్వారా రి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీ.జీ.పీ.ఎస్ సర్వే కార్యక్రమాన్ని ములుగు జిల్లా సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ రాజనర్సయ్య, మండల తాసిల్దార్ వేణుగోపాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుగుణంగా రీ సర్వే బృందానికి ఆదేశాలు జారీ చేశారు. మండల సర్వేయర్ వీరస్వామి, రీ సర్వే కార్యక్రమం లో పాల్గొన్నారు. డీ.జీ.పీ.ఎస్ రీసర్వే సంస్థ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది, ఆయా భూముల రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment