నేడు కాటారం మండల పరిషత్ సమీక్ష సమావేశం

నేడు కాటారం మండల పరిషత్ సమీక్ష సమావేశం

నేడు కాటారం మండల పరిషత్ సమీక్ష సమావేశం

కాటారం,జులై7, తెలంగాణజ్యోతి : మండల పరిషత్ కార్యాల యంలో నేడు(మంగళవారం) ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అడ్డూరి బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమయానికి హాజరుకావాలని సూచించారు. సమావేశంలో రాబోయే వర్షాకాలంలో వరదల నివారణ చర్యలు, సీజనల్ వ్యాధులపై అవగాహన, మంచినీటి వనరుల క్లోరినేషన్, పైపులైన్ల మరమ్మతులు, స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాలపై సమీక్ష జరగనుందన్నారు. రెవిన్యూ, పంచాయతీ, నీటిపారుదల, వైద్య, ఐసీడీఎస్, విద్యాశాఖ, హాస్టల్ వెల్ఫేర్, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, రోడ్లు భవనములు, పోలీస్, మత్స్యశాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలతో హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment