టీజేఎఫ్ రజతోత్సవ సభకు తరలిన జర్నలిస్టులు
ములుగు ప్రతినిధి, మే 31, తెలంగాణ జ్యోతి : తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) ఏర్పాడి 25 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా. హైదరాబాదులోని జలవిహార్ లో జరిగిన టీజేఎఫ్ సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభకు ములుగు నుంచి జర్నలిస్టులు తరలివెళ్లారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (హెచ్ 143) జిల్లా కన్వీనర్ దూడబోయిన రాకేష్ ఆధ్వర్యంలో గట్టమ్మ దేవాలయం వద్ద పూజలు నిర్వహించారు. తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ఏర్పడిన టీజేఎఫ్ ఆధ్వ్యర్యంలో సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడుదామన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (హెచ్-143) జర్నలిస్టు ప్రతినిధులు చుంచు రవి, గాదం దేవేందర్, బోయినపల్లి శ్రీధర్ రావు, గజ్జి రాజేష్, కొట్టె రాజిరెడ్డి, మనోజ్, దేశిని మహేందర్, కుమార్, కంది జీవన్ రెడ్డి, తోట అనిల్, కోరే అరవింద్, బైకాని వేణు యాదవ్, పత్తి కోటేశ్వర్ రావు, గుండెబోయిన అనిల్, సతీష్, రమేష్, తిరుమల్ రెడ్డి, రవి రాజా, సారంగపాణి, నరేందర్ రెడ్డి, చిన్నపూండ్ర సుభాష్ రెడ్డి, పిల్లలమర్రి రాము, జన్నారపు రమేష్, గొల్లన నరేందర్, తదితరులు పాల్గొన్నారు.