కేంద్ర పథకాల అమలు ఎలా ఉంది..?

కేంద్ర పథకాల అమలు ఎలా ఉంది..?

కేంద్ర పథకాల అమలు ఎలా ఉంది..?

– సెంట్రల్ ఐఅండ్ బీ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రిథుల్ కుమార్

– జిల్లాలో రెండు రోజుల పర్యటన

– కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష

ములుగు ప్రతినిధి, జూన్ 4, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు గాను సెంట్రల్ ఐఅండ్బీ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రిథుల్ కుమార్ జిల్లా పర్యటనకు వచ్చారు. గ్రౌండ్ ఇన్స్పెక్షన్ లో భాగంగా రెండు రోజుల పర్యటన చేపడు తుండగా బుధవారం ఆయన ములుగుకు రాగా కలెక్టర్ దివాకర టీఎస్ స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్ లో సెంట్రల్ బృందం సభ్యులతో కలిసి వివిధ శాఖల అధికారులతో కేంద్ర పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై), జల్ జీవన్ మిషన్ (జేజేఎం) వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో అమలవుతున్న తీరును పరిశీలిం చేందుకు జాయింట్ సెక్రటరీ రెండు రోజుల పర్యటనకు వచ్చారని తెలిపారు. జిల్లాలో అమలవుతున్న పాలెం వాగు ప్రాజెక్ట్, గ్రామీణ నీటి సరఫరా శాఖ పరిధిలోని ఐఈసీ కార్యా చరణలు, ఇండివిడ్యువల్ హౌస్ హోల్డ్ లాట్రిన్స్ (ఐహెచ్హెచ్ఎల్), కమ్యూనిటీ మరుగుదొడ్లు, విభజన షెడ్లు, స్వచ్ఛ్ భారత్ మిషన్, ఆయిల్ ఫామ్ సాగు, మిరప ప్రాసెసింగ్ యూనిట్ల స్థితిగతులపై సమగ్ర సమాచారం బృందానికి వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ ప్రితుల్ కుమార్‌ బృందం జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట కు వెళ్లి రామప్ప చెరువు ఇంటెక్ వెల్‌, వాటర్ గ్రిడ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నీటి శుద్ధి ప్రక్రియలపై అధికారులతో చర్చించి, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పాలంపేటలోని ఆయిల్ ఫామ్ తోటలను సందర్శించి పంట దిగుబడి, నీటి వినియోగం, రైతులకు కలుగుతున్న ఆదాయంపై సమగ్ర సమాచారం పొందారు. అనంతరం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి వెళ్లి శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ రామప్ప సరస్సు ఇంటెక్ వెల్ ద్వారా 175హ్యాబిటేషన్లకు తాగునీరు అందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. నీటిశుద్ధి విధానం ఉత్తమంగా అమలవుతోందని పేర్కొంటూ అధికారుల కృషిని ప్రశంసించారు. ఈ పర్యటనలో సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ చరణ్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ పి.కిరణ్ కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ. మల్లేశం, ఈఈ మాణిక్యరావు, డీఈఈ చెరుకు సతీష్, డీపీవో దేవరాజ్, హార్టీకల్చర్ అధికారి సంజీవ్ రావు, వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, అదనపు కలెక్టర్ సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర పథకాల అమలు ఎలా ఉంది..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment