అసైన్డ్ భూములపై త్వరలో ఉన్నత స్థాయి కమిటీ..!

On: March 26, 2026 3:18 PM

అసైన్డ్ భూములపై త్వరలో ఉన్నత స్థాయి కమిటీ

అసైన్డ్ భూములపై త్వరలో ఉన్నత స్థాయి కమిటీ

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, మార్చి 26, తెలంగాణజ్యోతి: రాష్ట్రంలో అసైన్డ్ భూముల్లో దశాబ్దాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదల సమస్యపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇందిరమ్మ హయాంలో ఆలేరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పేదలు, దళితులు, మైనారిటీలు, బీసీలకు భూములు కేటాయించగా, ప్రస్తుతం వేలాది కుటుంబాలు ఆ భూముల్లోనే నివసిస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభలో తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలోనే సుమారు 38 నుంచి 39 వేలమంది ఇళ్లను నిర్మించుకుని నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై సభ్యులు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో ఒకటి రెండు రోజుల్లో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ కమిటీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అసైన్డ్ భూముల్లో ఏర్పడిన నివాసాలపై తీసుకున్న చర్యలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించనుంది. అనంతరం అసెంబ్లీలో చర్చ జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!