వెంకటాపురం తహసీల్దార్‌ను కలిసిన జీఎస్‌పీ నాయకులు

వెంకటాపురం తహసీల్దార్‌ను కలిసిన జీఎస్‌పీ నాయకులు

వెంకటాపురం తహసీల్దార్‌ను కలిసిన జీఎస్‌పీ నాయకులు

వెంకటాపురం నూగూరు, జూన్6, తెలంగాణ జ్యోతి :  వెంకటాపురం మండల నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన ఏం. వేణుగోపాల్‌ను గొండ్వాన సంక్షేమ పరిషత్ (జీఎస్‌పీ) నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ నేతృత్వంలో తహసీల్దార్‌ను ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంత చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని నాయకులు తహసీల్దార్‌ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో గిరిజన నాయకులు తాటి లక్ష్మయ్య, రాజేష్, చంటి, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment