వెంకటాపురం తహసీల్దార్ను కలిసిన జీఎస్పీ నాయకులు
వెంకటాపురం నూగూరు, జూన్6, తెలంగాణ జ్యోతి : వెంకటాపురం మండల నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన ఏం. వేణుగోపాల్ను గొండ్వాన సంక్షేమ పరిషత్ (జీఎస్పీ) నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ నేతృత్వంలో తహసీల్దార్ను ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంత చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని నాయకులు తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో గిరిజన నాయకులు తాటి లక్ష్మయ్య, రాజేష్, చంటి, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.