రాంపూర్ లో ఇందిరమ్మ ఇండ్లనిర్మా ణానికి భూమి పూజ

_పాతర్చేడ్ గ్రామంలో రూ.28 లక్షల తో సి.సి. రోడ్లకు శంకుస్థాపన._ _అదే గ్రామంలో మరో20డబుల్ బె డ్ రూమ్ లఇండ్లు మంజూరు. _ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదల కు న్యాయం చేస్తాం అని-మంత్రి హామీ. నారాయణపేట జూలై 29, తెలంగా ణ జ్యోతి. మక్తల్ నియోజకవర్గం లోని, నర్వ మండలం,పాతర్చేడ్ గ్రామంలో రూ‌ 28 లక్షల నిధులతో చేపట్టిన సి.సి. రోడ్ల నిర్మాణ పనుల కు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెం ట్, క్రీడలు, యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రివర్యులు డా.వా కిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా మంత్రి వాకిటి శ్రీ‌ హరి మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో ప్ర జలు ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కివేసే పరిస్థితి ఉందని,కానీ కాంగ్రెస్ ప్రభు త్వం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ను కల్పిస్తోందని పేర్కొన్నారు. గత పాలకులు పాతర్చేడ్ గ్రామాన్ని పూ ర్తిగా విస్మరించారని, ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయ లేదని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టు బడి పనిచేస్తోందని పేర్కొంటూ- ఇ ప్పటికే ఈ గ్రామానికి 20ఇండ్లు మం జూరు చేశామని,వాటిలో ఎస్సీలకు 5 ఇండ్లు కేటా యించామని తెలిపా రు.అదనంగా మరో 20ఇండ్లనుమం జూరు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ వర్గాల పేదల కు న్యాయం చేస్తా మని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్ర భుత్వం పేదల ప్రభుత్వమని, వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు కృ షి చేస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జలంధర్ రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, జగదభి రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నా యకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

రాంపూర్ లో ఇందిరమ్మ ఇండ్లనిర్మా ణానికి భూమి పూజ

నారాయణపేట, జూలై 29, తెలంగాణజ్యోతి :  మఖ్తల్ నియోజకవర్గం లోని నర్వ మండలం రాంపూర్ గ్రామంలో ఇల్లు లేని ప్రతి బీదవాడికి స్వంత ఇంటి కలను నెరవేర్చాలనే ధ్యేయంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లు పథకం క్రింద నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పర్యవేక్షణలో నియోజకవర్గానికి మొత్తం 3,500 ఇళ్లు కేటాయించగా, అందులో భాగంగా రాంపూర్ గ్రామానికి వచ్చిన ఇండ్లకు భూమి పూజ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షుడు నాగన్నగారి నరసింహారెడ్డి, ఎంపీడీ వో శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ వినయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి భ ట్టుమూర్తి, గ్రామ కాంగ్రెస్ నాయకు లు, మాజీ ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment