ఘనంగా గోదావరి నదిహారతి

ఘనంగా గోదావరి నదిహారతి

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాళేశ్వరం లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవలయం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్, హైదరాబాద్ ఆదేశాల మేరకు ప్రతి నెల పౌర్ణమి రోజున గోదావరి నదీహారతి కార్యక్రమం నిర్వ హించు ట జరుగుచున్నది. అందులో భాగంగా ఈరోజు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానం కాళేశ్వరం నుండి మంగళ వాయిద్యాలు, ,వేదమంత్రాలతో, గోదావరి నది వద్దకు వెల్లి ప్రధాన అర్చకులు త్రిపురారి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక స్వాములు,గోదావరి నదీ హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఆలయ సూపరిండెంట్ బుర్రి శ్రీనివాస్ సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు,సేవాసమితి, సభ్యులు ,మహిళలు, పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment