ములుగు జిల్లాకు ఫామ్ ఆయిల్ కర్మాగారం మంజూరు  హర్షనీయం

ములుగు జిల్లాకు ఫామ్ ఆయిల్ కర్మాగారం మంజూరు  హర్షనీయం

– కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్​

– సీఎం, మంత్రులకు కృతజ్ఞతలు

ములుగు ప్రతినిధి,జూన్ 6, తెలంగాణ జ్యోతి : వెనుకబడిన ములుగు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి దారులు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సహకారంతో 12 ఎకరాల్లో ఆయిల్​ ఫామ్ కర్మాగారం ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపడం హర్షణీయమని, అందుకు గాను ముఖ్యమంత్రి, మంత్రులకు కృతజ్క్షతలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్​ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ములుగులో మండల అధ్యక్షుడు ఎండి.చాంద్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో అశోక్ మాట్లాడారు. మంత్రి సీతక్క ములుగు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందితే, స్థానిక నిరుపేద యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే భావనతో ముందుకు సాగుతున్నారన్నారు. ఈ క్రమంలోనే జిల్లాకు ఆయల్​ ఫాం కర్మాగారం మంజూరు ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. గతంలో మల్లంపల్లి ప్రత్యేక మండలం ఏర్పాటు, ఏటూరు నాగారం డివిజన్, ఆధునిక బస్టాండ్, బస్ డిపో, వందల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. యువత ఉపాధి కోసం ఉద్యోగ మేళాలు నిర్వహించి, అనేక మందికి ఉపాధి కల్పించారని కొనియాడారు. జిల్లాకు రానున్న రోజుల్లో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో అభివృద్ధి ఫలాలు మంజూరవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment