సరస్వతి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు

సరస్వతి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు

సరస్వతి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు

– దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజా రామయ్యర్.

కాటారం, తెలంగాణ జ్యోతి : 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా విచ్చేయు భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. బుధవారం సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరస్వతి మాతా విగ్రహం, ఘాట్ ప్రారంభోత్సవం చేస్తారని, పుష్కర స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటారని, అనంతరం త్రివేణి సంగమంలో మొట్ట మొదటి సారిగా కాశీ పండితులు నిర్వహించనున్న నదీ హారతిలో పాల్గొంటారని తెలిపారు. మన రాష్ట్రంలో. మొట్ట మొదటిసారిగా పెద్ద ఎత్తున పుష్కరాలు నిర్వహిస్తున్నామని జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఆమె సూచించారు.

పుష్కరాలలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

సరస్వతి పుష్కరవిధులు కేటాయయించిన సిబ్బంది అప్రమత్తం గా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ 12 రోజులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం కాలేశ్వరం దేవస్థానంలోని కళ్యాణ మండపంలో విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి కేటాయించిన విధుల పట్ల దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లాలో పెద్ద ఎత్తున సరస్వతి పుష్కరాలు జరుపుతు న్నామని, అందుకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు లక్షకి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రతి అధికారికి కేటాయించిన లొకేషన్స్ లో ముందస్తు గా పర్యటించి ఏర్పాట్లు పరిశీలన చేయాలని తెలిపారు. గైర్హాజరైన అధికారులకు, సిబ్బందికి ఆయా శాఖలకు తగు చర్యలు నిమిత్తం సిఫారసు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నా రు. 15వ తేదీ ఉదయం పుష్కరాలు ప్రారంభమవుతాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పుష్కరాలను ప్రారంభించనున్నారని తెలిపారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరణ, పుష్కర స్నానం తదుపరి స్వామి వారి దర్శనం, గోదావరి హారతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారని అనంతరం టెంట్ సిటీ పరిశీలిస్తారని తెలిపారు. కాశీ పండితులతో ప్రత్యేకంగా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న ఈ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని అన్నారు. కుంభమేళా వెళ్లలేని వారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ఆ ప్రకారం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ 12 రోజుల విధులు చాలా ముఖ్యమని ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు. సరస్వతి ఘాట్ మెయిన్ ఘాట్ వద్ద భక్తులు పుష్కర స్నానాలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. భక్తులకు స్నానాల షవర్లు, బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిండ ప్రధాన కార్యక్రమాలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. స్టాళ్లు, టెంట్ సిటీ, డార్మెటరీ, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికారులు తు.చ తప్పక విఐపి ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని కంట్రోల్ రూమ్ కి వచ్చిన సమస్యను తక్షణమే ఆయా శాఖల అధికారులు దృష్టి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాలయంలో భక్తులు క్యూలైన్ పాటించేలా చర్యలు తీసు కోవాలని అన్నారు. 50 మంది గజ ఈతగాళ్ళు నాటు పడవ లతో పహారా కాస్తున్నట్లు తెలిపారు. విధులు నిర్వహించే అధికారులు సిబ్బందిని పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాత్కాలిక బస్టాండ్ నుంచి ఘాట్స్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచితంగా 30 షటిల్ బస్సులు నడుపుతున్నామని భక్తులు సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. పుష్కరవిధులు కేటాయించిన అధికారు లకు రెండు షిప్టుల్లో విధులు కేటాయించామని అప్రమత్తంగా ఉండాలని, సమయానికి విధులకు హాజరు కావాలని తెలిపారు. ఎవరైనా గైర్హాజరు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధులు కేటాయించిన సిబ్బందికి భోజన, వసతి ఏర్పాటు చేస్తున్నామని సమయ పాలన పాటించాలని సూచించారు. స్విమ్మర్లు లైఫ్ బాయ్స్, జాకెట్స్ ధరించాలని గోదావరిలో ఏ ఒక్కరు మిస్ అయిన విధులకు ఇబ్బంది కలుగుతుందని అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ డైరెక్టర్ వెంకట రావు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డిఓ రవి అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆకర్షణ గా ఉన్న స్తాల్స్

సరస్వతి పుష్కరాల సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తున్నాయి. పవిత్ర సరస్వతి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలో స్వయం సహాయక సంఘాల (SHG) స్టాళ్లు, హ్యాండ్లూమ్ మరియు టెక్స్‌టైల్ ఉత్పత్తుల స్టాళ్లు పెద్ద ఎత్తున సందర్శకులను ఆకట్టుకునేలా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఏర్పాటు చేశారు. స్టాళ్లు. పర్యవేక్షణ కు డిఆర్డీఓ నరేష్, పరిశ్రమల శాఖ జిఎం సిద్దార్ధలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు తమ కృషిని ప్రతిబింబించేలా నాణ్యమైన హస్తకళా ఉత్పత్తులు, సేంద్రీయ ఆహార పదార్థాలు, పచ్చడులు ఇతర గ్రామీణ ఉత్పత్తులను విక్రయాలు చేయనున్నారు. స్థానికంగా తయారైన ఈ ఉత్పత్తులు పుష్కర సందర్శకుల నుండి విశేష ఆదరణ లభించనుంది. అలాగే టెక్స్‌టైల్ మరియు హ్యాండ్లూమ్ స్టాళ్లలో పట్టు చీరలు, నూలు వస్త్రాలు, డిజైన్‌ దుస్తులు, చేనేత వస్త్రాలతో కూడిన ప్రత్యేక కలెక్షన్‌ ప్రదర్శించబడుతోందని పర్యవేక్షణ అధికారులు తెలిపారు. ఈ ప్రాంత హస్తకళల పరంపరను ప్రతిబింబిస్తూ పుష్కర సందర్శకులను ఆకర్షిస్తున్నా యి. ప్రత్యేక ఆకర్షణగా మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు తక్కువ ధరల్లో, నేరుగా ఉత్పాదకుల నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్టాళ్లు ఏర్పాటు ద్వారా స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడేందుకు ఇలాంటి అవకాశాలు ఎంతో ఉపయోగపడతా యని తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment