అంతా నా ఇష్టం.. ఆయన రూటే సపరేట్..!
-తహసీల్దార్ కార్యాలయంలో బాస్ నేనంటూ ప్రచారం..
-కళ్యాణ లక్మి డబ్బులు రావాలంటే ఇవ్వాల్సిందేనని బెదరింపులు..
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ములుగు జిల్లాలోని ఆ మండలానికి ఒక మంచి పేరుంది. కాని ఆ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి ఆడిందే ఆట అంతా ఆయన ఇష్టంగా మారిందని మండల ప్రజల గుస గుసలాడుతున్నారు. ఆ మండలంలో కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకోవాలంటే అతనికి వేలల్లో డబ్బులు ఇవ్వాల్సిందే.. లేకపోతె కళ్యాణ లక్ష్మి రాదనీ కొందరిని దబాయిస్తూ వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడని ప్రజలో చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నుండి ఉచితంగా వచ్చే డబ్బులే కదా మీకెందుకు ఇవ్వాలని కొంత మంది అయినను ప్రశ్నిస్తే నాకు డబ్బులు ఇవ్వకుండా మీకు ఎలా పని జరుగుతుందో నేను చూస్తాననడం విడ్డూరమని, ఏ అప్లికేషన్ అప్లై చేసుకోవాలన్నా అతనికి ముడుపులు ముట్టాల్సిందేనని, నెలవారిగా జీతం సరిపోతాలేదా అంటూ ప్రజలు మండి పడుతున్నారు. గ్రామ ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తూ ఎమ్మార్వో కు ఉన్న మంచి పేరును సైతం దెబ్బ తీసేలా చేస్తున్న అధికారిపై మండల అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
తహసిల్దార్ సార్ కు తెలియకుండా..!
గతంలో తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెర్వో సార్ కు తెలియకుండా మట్టికి పర్మిషన్ ఇవ్వడం ఏంటని, ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. గత 10 రోజుల క్రితం తహసీల్దార్ కార్యాలయానికి మట్టి అవసరం ఉందని పేరు చెప్పి తన సొంత భూమికి తొలుకున్నట్టు స్వష్టంగా కనపడుతుంది. ఎమ్మార్వోను వివరణ కోరితే నేను పర్మిషన్ ఇవ్వలేదు ఆర్ ఐ ఇచ్చారని సమాధానం చెప్పారు. ఆర్ ఐ అడుగుతే రైతు అనుమతులు తీసుకున్నారని జరిగింది.