ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

– ఎస్సై వెంకటేశ్వర్ రావు

– 15 నుంచి మండలంలో స్పెషల్ డ్రైవ్ 

ములుగు ప్రతినిధి, జూన్ 14, తెలంగాణ జ్యోతి : ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఈనెల 15 నుంచి ములుగు మండలంలోని 32 గ్రామపంచాయతీల పరిధి లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఈమేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ప్రతీ బైకిస్ట్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రిపుల్ రైడ్ నిషేదమని, మద్యం తాగి వాహనాలు నడుపొద్దని ఆదేశించారు. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లు కలిగి ఉండాలని, వాహనాలకు నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా కలిగి ఉండాలన్నారు, నెంబర్ ప్లేట్ లేనట్లయితే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. నిబంధనలు పాటించనట్లయితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానా విధిస్తామని ఎస్సై పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment