పురపాలక సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవ వేడుకలు
ములుగు ప్రతినిధి, జూన్ 5, తెలంగాణ జ్యోతి : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు పుర పాలక సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించి ఈవో రఘు ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జె. సంపత్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ సంపత్ మాట్లాడుతూ “పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్క నాటి దాన్ని రక్షించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే భవిష్యత్ తరాలకు అందించగల గొప్ప ఆస్తి” అని పేర్కొన్నారు. ములుగు పట్టణ ప్రధాన వీధుల్లో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పర్యావరణ పరిరక్షణ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ ర్యాలీలో స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పురపాలక సిబ్బంది, స్థానిక యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.