టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా దుద్దిల్ల శ్రీనుబాబు 

టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా దుద్దిల్ల శ్రీనుబాబు 

టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా దుద్దిల్ల శ్రీనుబాబు 

– కాటారంలో అంబరాన్ని అంటిన సంబరాలు

కాటారం, జూన్ 10,తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ళ శ్రీను బాబు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా మంగళవారం కాటారం మండల కేంద్రంలోo కాంగ్రెస్ పార్టీ మరియు యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి, మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రియ సోదరులు దుద్దిళ్ళ శ్రీను బాబు ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన ఏఐసిసి, టిపిసిసి పెద్దలకు కాటారం మండల కాంగ్రెస్ పార్టీ మరియు యూత్ కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబుకు వెన్నంటు ఉంటూ, మంథని నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ, ప్రజలకు ఏ సమస్య వచ్చిన క్షణంలో పరిష్కరిస్తూ గత 25 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడం పట్ల వారు చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసీసీ పెద్దలకు దుద్దిల్ల శ్రీను బాబును ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల మంథని నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో శీను బాబు మంథని నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయడానికి వారితో పాటు మేము సైతం నడుస్తామని మండల కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు సామాజిక మాధ్యమాల్లో శ్రీధర్ బాబు సోదరులు శీను బాబు కు పదవి రావడం పట్ల అసత్య ఆరోపణలు చేయడం,గతంలో ఈ నియోజకవర్గంలో ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చి పదవి కట్టపెడితే వారు వారి కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చుకున్న ఘనత ఎవరిదో ఈ మంథని నియోజకవర్గ ప్రజల గమనించారన్నారు. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క మండలాన్ని విభజించుకొని దందాలు రౌడీ రాజకీయాలు చేసిన చరిత్ర ఎవరిదో ఈ నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసని మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఆరోపించారు. 25 సంవత్సరాల నుండి ఎలాంటి పదవి లేకుండా ఈ యొక్క ప్రాంత ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారని, పదవిలేని సమయంలోనే శ్రీపాద ట్రస్టు ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసినటువంటి చరిత్ర దుద్దిళ్ల కుటుంబనీకే స్వంతమని అన్నారు. పదవి లేనప్పుడే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే అటువంటి శ్రీనుబాబు కు పదవి వస్తే ప్రజల్లో మా ఉనికి కోల్పోతున్నాం ఇక జీవితంలో మేము ప్రజాక్షేత్రంలో గెలవడం కష్టమనే భయంతో రాజకీయ విలువలకు వ్యతిరేకంగా అనుచిత వాక్యాలు చేస్తున్నారని మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవలసిందిగా హెచ్చరించారు. మరోసారి దుద్దిళ్ళ శ్రీను బాబు ను మండల కాంగ్రెస్ పార్టీ మరియు యూత్ కాంగ్రెస్ కార్యకర్తల పక్షాన హార్దిక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment