శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్న డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్న డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి

కాళేశ్వరం,తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి నారాయణ బాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వారిని ప్రధాన రాజగోపురం ముందు నుండి అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారికి అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం చేయించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్ వారికి స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు. వేద పండితులు అర్చక స్వాములు జడ్జి దంపతులకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాళేశ్వరం ఎస్సై చక్రపాణి, మహా ముత్తారం ఎస్సై మహేందర్, మహాదేవపూర్ ఎస్సై పవన్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment