పుష్కర స్నానాలకు పోటెత్తిన భక్తజనం
త్రివేణి సంగమంలో వేల సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలు
వేల సంఖ్యలో వాహనాల రాకతో ట్రాఫిక్ జామ్
ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పి కిరణ్ ఖరే
కాలేశ్వరంలో సౌకర్యాలపై యాత్రికులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్
టోల్ వసూలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు
కాటారం, తెలంగాణ జ్యోతి : కాలేశ్వరంలో సరస్వతి నదికి జరుగుతున్న పుష్కరాలలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు శుక్రవారం వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే కాలేశ్వరం చేరుకున్న భక్తులు సరస్వతి పుష్కర ఘాట్ లోని త్రివేణి సంగమములో పుణ్యస్నానాలు ఆచరించారు. మూడు రోజులలో పుష్కరాలు ముగుస్తుండడంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో అంతర్వాహిని సరస్వతి నది పుష్కర పుణ్య స్నానాలు చేస్తూ భక్తులు నదీ జలాలకు పూజలు నిర్వహిం చారు. పిండ ప్రదానం తో పితృ కర్మలు నిర్వహించారు మహిళ లు ముత్తైదువలు మొంటెల వాయినం ఇచ్చారు. సరస్వతి నదికి చీరె,జాకిటి ముక్క, గాజులు, పసుపు, కుంకుమను సారె ను సమర్పించారు. గోదావరి నది తీరంలో సైకత లింగం చేసి పూజలు నిర్వహించారు పోటీ వత్తులు లక్ష వత్తులు వెలిగించి శంకరునికి చూపించారు. దీపదానం చేశారు. అరటి దుప్పల లో దీపాలను వెలిగించి నదిలో వదిలారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించుకుని పూజలు చేశారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
శుక్రవారం ఉదయం నుండి వాహనాలలో భక్తులు కాళేశ్వరం కు చేరుకుంటున్న సమయంలో ట్రాఫిక్ సమస్య నెలకొంది. అన్నారం స్తూపం నుండి వన్ వే గా వాహనాలను మళ్ళించారు. పూసుకు పెళ్లి గ్రామం నుండి కాళేశ్వరం కు భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా, రవాణా వ్యవస్థను సమర్ధ వంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ రాహుల్ శర్మ మరియు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పర్యటిస్తూ వాహనాలను క్రమబద్దీకరి స్తున్నారు. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుంటూ భక్తిభావంతో తీర్థయాత్ర కొనసాగిస్తున్నారు. భద్రత, శానిటేషన్, ఆరోగ్య సదుపాయా లపైన ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా యంత్రాంగం రానున్న మూడు రోజులు భక్తులు రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తోందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
టోల్ వసూలు రద్దు
కాళేశ్వరం వచ్చే భక్తుల వాహనాలకు తక్షణమే టోల్ వసూళ్లు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పంచాయతి అధికారులను ఆదేశించారు.టోల్ వసూళ్లు వల్ల వాహనాలు రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. భక్తుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తక్షణమే టోల్ వసూళ్లు నిలిపి వేయాలని, పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని డిపిఓను ఆదేశించారు.
పుష్కరాల్లో సేవలకు వాకింగ్ టాకీల వినియోగం
సరస్వతి పుష్కరాల్లో సత్వర సమాచార సేకరణకు వాకీ టాకీలు సేవలు వినియోగిస్తున్నారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులు త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేసేందుకు తరలివస్తున్నారు. భద్రత, రవాణా, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో సమయానికి స్పందన ఇచ్చేందుకు మరియు విపత్తులను వెంటనే అధిగమించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సాంకేతిక సేవలను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీస్, రెవెన్యూ, వైద్యం, పంచాయతి రాజ్, ఆర్టీసీ, దేవాదా య, విద్యుత్, డిఆర్డీఓ తదితర శాఖల అధికారులతో ఎప్పటిక ప్పుడు సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు వాకీ టాకీలు (వైర్లెస్ కమ్యూనికేషన్) సేవలను విస్తృతంగా వినియోగిస్తు న్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మరియు ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, ప్రతి ప్రాంతానికి సంబంధించి అధికారులతో నేరుగా కమ్యూనికేషన్ జరిపేలా ఏర్పాట్లు చేశారు. వాకీ టాకీలు ద్వారా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పడే అత్యవసర పరిస్థితులను వెంటనే గుర్తించి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.పుష్కర ఘాట్లు, ట్రాఫిక్ నియంత్రణ ప్రాంతాలు, పార్కింగ్ జోన్లు, ఉచిత వాహన కేంద్రాలు మొదలైన ప్రాంతాల్లో అధికారులకు, సిబ్బందికి వాకీ టాకీలు అందుబాటులో ఉంచి, నిరంతరంగా సమాచారం అందిస్తున్నారు. ఈ సాంకేతిక వినియోగం ద్వారా అప్రమత్తత, వేగవంతమైన స్పందన,సమర్థవంతమైన నిర్వహణ సాధ్యమవు తోందని అధికారులు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.