కార్తీకమాసం సందర్భంగా కాళేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

కార్తీకమాసం సందర్భంగా కాళేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా శనివా రం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి దేవాలయంలో ప్రత్యే క పూజలు చేశారు. ముఖ్యంగా మహిళలు ఉసిరిక చెట్టు కింద దీపాలు వెలిగించారు. అభిషేకాలు కుంకుమార్చన ఇత ర పూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో క్యూ లైన్ లో భక్తులు కిక్కిరిసారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో మారుతి, పర్యవేక్షకులు బుర్రి శ్రీనివాస్ తెలిపారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment