ఘనంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

ఘనంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

ఘనంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

– కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

వెంకటాపురం నూగూరు, జూన్15, తెలంగాణజ్యోతి : తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో కేక్ కట్  చేసి కాంగ్రెస్ పార్టీ నేతలు పరస్పరం మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పథకాలను అర్హులైన వారికి చేరుస్తూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, సీనియర్ నేతలు పిఎసిఎస్ అధ్యక్షుడు చిడెం మోహన్ రావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మన్యం సునీల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడెం సాంబశివరావు, అధికార ప్రతినిధి శ్రీరాముల రమేష్, నాయకులు బాలసాని వేణు, గుండ మల్ల కిరణ్, జి. నాగేశ్వరరావు, రంగయ్య నాయుడు, డర్రా రవి, పల్నాటి ప్రకాష్, మద్దుకూరు ప్రసాద్, మాజీ ఎంపిటిసిలు రవి, సీతాదేవి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment