మృగశిర కార్తె సందర్భంగా చేపలకు బలేగిరాకి

మృగశిర కార్తె సందర్భంగా చేపలకు బలేగిరాకి

మృగశిర కార్తె సందర్భంగా చేపలకు బలేగిరాకి

వెంకటాపురంనూగూరు, జూన్8,తెలంగాణ జ్యోతి : పురాణ సంప్రదాయాల ప్రకారం మృగశిర కార్తె రోజున చేపల కూర తినడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఉంది. ఈ నమ్మకంతో ఆదివారం మృగశిర కార్తె ఆరంభం సందర్భంగా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని గోదావరి నదీ తీరాలకు ప్రజలు వేకువజాము నుండే గోదావరి చేపల కోసం ప్రజలు పరుగులు తీశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని మత్స్య కారుల వద్దకు, అలాగే ఐస్ బాక్సుల్లో ఆంధ్ర, తెలంగాణ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చేపల ట్రక్కులు కూడా వెంకటాపురం మార్కెట్‌ను కిటకిటలాడేలా చేశాయి. చేపలపై భారీ డిమాండ్ కారణంగా చికెన్, మటన్ దుకాణాల్లో విక్రయాలు గణనీయంగా తగ్గాయి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment