ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా

On: February 13, 2026 12:49 PM

మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చులు పక్కాగా చూపించాలి : కమిషనర్ రమేష్

ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ నెల 11న జరిగిన పోలింగ్‌కు సంబంధించి నేడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొదటి రౌండ్‌లో 1 నుంచి 14 వార్డుల వరకు లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో

  • కాంగ్రెస్ పార్టీ – 10 వార్డులు గెలుపొందగా, బీఆర్ఎస్ – 2 వార్డులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు – 2  గెలుపొందాయి.

 గెలిచిన అభ్యర్థులు:

  • 1వ వార్డు: ఆలోతు పద్మ (కాంగ్రెస్)

  • 2వ వార్డు: కోయిల లక్ష్మి (బీఆర్ఎస్)

  • 3వ వార్డు: యాసం వసంత (కాంగ్రెస్)

  • 4వ వార్డు: గుంటోజు పావని (కాంగ్రెస్)

  • 5వ వార్డు: గుగ్గిళ్ల దివ్య (కాంగ్రెస్)

  • 6వ వార్డు: చింతనిప్పుల చంద్రకళ (కాంగ్రెస్)

  • 7వ వార్డు: బైకాని సునీత (బీఆర్ఎస్)

  • 8వ వార్డు నల్లెల్ల స్వాతి భరత్ (కాంగ్రెస్),
  • 9వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి గండ్రకోట వాణీ
  • 10 వ వార్డు గజ్జల సుస్మిత (కాంగ్రెస్)
  • 11వ వార్డు కేశెట్టి నవీన్ (కాంగ్రెస్)
  • 12 వ వార్డు పోరిక రాజు నాయక్ (ఇండిపెండెంట్)
  • 13 వ వార్డు చిలువేరు సాంబయ్య (కాంగ్రెస్)
  • 14 వ వార్డు ఆసియా షాహిద్ (కాంగ్రెస్) లు గెలుపొందారు. మిగిలిన వార్డుల లెక్కింపు కొనసాగుతోంది.

మిగిలిన వార్డుల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రాలను అందజేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!