ఐ డి ఓ సి కార్యాలయంలో కలెక్టర్లకు సన్మానం
– ఘనంగా సివిల్ సర్వీసెస్ దినోత్సవం
కాటారం, తెలంగాణజ్యోతి : జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్స వాన్ని భూపాలపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు, కాటారం సబ్ కలెక్టర్ మయాంఖ్ సింగ్ లకు సోమవారం పుష్ప గుచ్చాలు ఇచ్చిశాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజా పరిపాలనలో ఉన్నత ప్రమాణాలను నిర్ధారించడమే కాకుండా, ప్రజలతో సాన్నిహిత్యాన్ని పెంపొందించడం, సమర్థ వంతమైన పాలన అందించడమని తెలిపారు. 1947లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ దినోత్సవాన్ని ప్రారంభిం చిన సందర్భంగా గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం జరుపుతారని ఆయన తెలిపారు. యువత సివిల్ సర్వీసెస్ వైపు. మొగ్గు చూపాలని, ప్రజా సేవలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చిట్ట చివరి లబ్ధిదారులకు చేరేలా మనందరం కృషి చేయాలని ఆయన సూచించారు. సేవల్లో ప్రజల మన్ననలు పొందాలని అదే ఉద్యోగి జీవితానికి ధన్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు, టీఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి షఫీ అహ్మద్ పాల్గొన్నారు.