బాండు మొక్కజొన్న సాగు నష్టపరిహారంపై కలెక్టర్ సమీక్ష  

బాండు మొక్కజొన్న సాగు నష్టపరిహారంపై కలెక్టర్ సమీక్ష  

బాండు మొక్కజొన్న సాగు నష్టపరిహారంపై కలెక్టర్ సమీక్ష  

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని యోగితనగర్ వంటిమామిడి ప్రాథమిక పాఠశాలలో బుధవారం బాండు మొక్కజొన్న సాగు నష్టపరిహారం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర  ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హైటెక్ కంపెనీ ప్రతినిధులు, స్థానిక రైతులతో సమీక్ష నిర్వహించి వారి పెట్టుబడి వివరాలు, రైతుల అభిప్రాయాలను సేకరించారు. రైతులకు నష్టపరిహారం అందించే విధంగా తగు చర్యలు తీసుకునే విషయమై నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మిగతా గ్రామాల్లో వ్యవసాయ అధికారులు, కంపెనీ ప్రతినిధులు కలిసి రైతుల వద్దకి వెళ్లి పెట్టుబడి వివరాలు సేకరించి, నష్ట పరిహారాన్ని ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి, సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారి, తహసిల్దార్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment