చల్వాయి ప్రభుత్వ పాఠశాల విద్యారంగానికి కొత్త ఊపు
– పాఠశాలల్లో 97 మంది విద్యార్థుల చేరిక
గోవిందరావుపేట, జూన్26, తెలంగాణజ్యోతి : గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామ విద్యా స్థాయిని ప్రతిబింబించేలా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో 52 మంది, జడ్పీ ఉన్నత పాఠశాలలో 45 మంది మొత్తంగా 97 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు, విద్యార్థులతో కలిసి ఓ సమూహ ఫోటో తీసుకుని సంతోషాన్ని పంచుకున్నారు. గ్రామస్థాయి విద్యా సదుపాయాలు మెరుగవుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుకుంటున్నారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పాఠశాలల్లోని నాణ్యమైన బోధన, ఆకర్షణీయమైన స్కూల్ కిట్లు, మధ్యాహ్న భోజన వసతి, మరియు ప్రగతిశీల టీచర్ల కృషితో విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయన్నారు.