డయల్ యువర్ డీఎంకు ఫోన్ చేయండి
– వరంగల్ 2డిపో మేనేజర్ జ్యోత్స్న
ములుగు ప్రతినిధి : సమస్యల పరిష్కారం కోసం చేపడుతు న్న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ వరంగల్ 2 డిపో మేనేజర్ వి.జ్యోత్స్న ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 25న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించబడుతుందని, ములు గు జిల్లా పరిధిలోని ప్రయాణీకులు తమ సమస్యలను తెలపా లని సూచించారు. సలహాలు, సూచనలు కూడా ఇవ్వొచ్చని, 99592 26048 నెంబర్ కు కాల్ చేసి విన్నవించాలన్నారు.