లక్ష్మణ్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నేత బొట్ల కార్తిక్
యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలి : లక్ష్మణ్ బాబు
ఏటూరునాగారం, జూలై 27, తెలంగాణ జ్యోతి : బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబును ఆయన నివాసంలో బిఆర్ఎస్ జిల్లా నాయకుడు బొట్ల కార్తిక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల ప్రాధాన్యతపై చర్చ జరిగింది. గ్రామ గ్రామాన బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేలా అందరూ ఐక్యంగా పనిచేయాలని లక్ష్మణ్ బాబు పిలుపునిచ్చారు.యువత రాజకీయాల్లోచురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ ఐపీఎస్ అధికారి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తో ఫోన్ ద్వారా ములుగు జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చ జరిపారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ యువజన నాయకులు వావిలాల కిషోర్ కుమార్, ఎంపెల్లి రాజు, సతీష్, అనిల్ రాజు, సారయ్య తదితరులు పాల్గొన్నారు.