నిరుపేద కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సహాయం
వెంకటాపురంనూగూరు, జూన్6,తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం కృష్ణాపురం గ్రామ పంచాయతీకి చెందిన నిరుపేద పైపూరు భీమేశ్వరరావు కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులలో చూసిన వాజేడు మండల బీఆర్ఎస్ నాయకులు మానవతా స్పూర్తితో ముందుకు వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ కుటుంబానికి నూగురు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షుడు పెనుమాళ్ల రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో రూ.10 వేల నగదు, 50 కేజీల బియ్యం అందజేసి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కొత్తగట్టు సాంబమూర్తి, యూత్ అధ్యక్షుడు ముడిగ తిరుపతి, కృష్ణాపురం సర్పంచ్ పునేం నాగాచంద్ర, మాజీ ఎంపీటీసీ యాలం చిట్టిబాబు, నాయకులు మాడే కృష్ణయ్య, పునేం అశ్వపతి, పూనేం శారద, మాడే లక్ష్మణరావు, సొనప గోవర్ధన్, సభక సంతోష్, మాడే గన్ను తదితరులు పాల్గొన్నారు.