వెంకటాపురం ఏజెన్సీలో కొనసాగుతున్న బంద్

వెంకటాపురం ఏజెన్సీలో కొనసాగుతున్న బంద్

వెంకటాపురం ఏజెన్సీలో కొనసాగుతున్న బంద్

– విస్తృతంగా పోలీసుల పహారా

వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : మావోయిస్టుల పిలుపు మేరకు ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో శుక్రవారం బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన వెంకటాపురం సర్కిల్లో అదనపు పోలీస్ ల మోహరింపుతో అటవీ గ్రామాల్లో ఇళ్లలోంచి బయటకు వెళ్లాలంటే గిరిజనులు భయాంధోళనలు వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని పేరూరు, వాజేడు, వెంకటాపురం పోలీస్ స్టేషన్ల పరిదిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్తక వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హాలు మూసివేశారు. వెంకటాపురం ప్రధాన వీధులలో పోలీసు బలగాలు మోహరించాయి. వచ్చే పోయే వాహనాలను పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబడుతున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment