ఎల్లారెడ్డిపల్లిలో అయోధ్య రామ మందిర అక్షింతల శోభ యాత్ర
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : ఈనెల 22న అయోధ్య లో జరిగే బలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అయోధ్య నుంచి వెంకటాపూర్ మండల కేంద్రంలోని రామాలయానికి అక్షింతలు వచ్చాయి .కాగా ఎల్లారెడ్డిపల్లి హనుమాన్ భక్తులు, గ్రామస్తులు మంగళవారం వెంకటాపూర్ రామాలయానికి చేరుకోగా, వేద పండితులు ముడుంబా రఘునాథ చార్యులు, ఆలయ చైర్మన్ భాస్కర్, చింతరెడ్డి రమణారెడ్డి ,పల్నాటి రమేష్ ఆధ్వర్యంలో అక్షిం తలు అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపల్లి హనుమాన్ భక్తు లు, గ్రామస్తులు డప్పు చప్పుల నడుమ అక్షింతలను ఎల్లారెడ్డి పల్లి గ్రామానికి చేరవేసి గ్రామంలో అక్షింతలతో ఘనంగా శోభాయా త్ర నిర్వహించారు .ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపల్లి గ్రామం శ్రీరామ నామ స్మరణతో మార్మోగిపోయింది.ఈ నేపథ్యంలో గ్రామస్తులు తమ తమ ఇంటిముందు నీటిని ఆరగిస్తూ మంగళారతులతో అక్షింత లకు ఘన స్వాగతం పలికారు. శోభయాత్ర అనంతరం అక్షింతలను గ్రామంలోని హనుమాన్ దేవాలయానికి చేర్చి వేదపండితులు కొల నుపాక శివుడు ఆధ్వర్యంలో గ్రామస్తులు, హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు, గ్రామ పెద్దలు బేతి సతీష్ , బైకని చిన్న రాజయ్య, పులి కోటయ్య, చింతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బండి శ్రీను, మెంతుల వంశీ, మెంతుల బన్నీ, మెంతుల సంతోష్, సోమిడి రవి, పులాల రత్నం, బొల్లావెన నరేష్, బండి రంజిత్, పులి నర్సయ్య, కొలనుపాక సంప త్, కొలనుపాక శివుడు , లెంకల తిరుపతి, మర్రి లడ్డు, వలబో జు సత్యం, కొలనుపాక రాహుల్, కొలనుపాక భద్రయ్య పాల్గొన్నారు.
1 thought on “ఎల్లారెడ్డిపల్లిలో అయోధ్య రామ మందిర అక్షింతల శోభ యాత్ర”