విద్యుత్ షాక్ తో దుక్కిటెద్దు మృతి

విద్యుత్ షాక్ తో దుక్కిటెద్దు మృతి

విద్యుత్ షాక్ తో దుక్కిటెద్దు మృతి

వెంకటాపూర్,జూన్ 29, తెలంగాణజ్యోతి :  ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మండలంలోని మల్లయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధి వెంకటేశ్వర్లపల్లికి చెందిన రైతు కన్నం సారయ్య చెందిన రూ.70 వేలు విలువగల దుక్కిటెద్దు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధిత రైతు కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం ఎద్దులను మేతకు విడిచి పెట్టినట్లుగా తెలిపారు. మేత మేస్తున్న ఎద్దు పొలాల్లో ఉన్న ట్రాన్స్ పార్మర్ సపోర్ట్ వైర్ కి విద్యుత్ షాక్ రావడంతో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కన్నీరు మున్నీరయ్యాడు. ప్రభుత్వం,సంబంధితఉన్నతాధికారులు ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment