పుష్కరాల సమయానికి పనులన్నీ పూర్తి చేయాలి

పుష్కరాల సమయానికి పనులన్నీ పూర్తి చేయాలి

పుష్కరాల సమయానికి పనులన్నీ పూర్తి చేయాలి

– కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్

కాటారం,తెలంగాణజ్యోతి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో నిర్వహించే సరస్వతి నది పుష్కరాల సమయానికి అభివృద్ధి పనులని పూర్తి చేయాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ ఆదేశించారు. కాలేశ్వరంలోని పుష్కర్ ఘాట్ వద్ద జరుగుతున్న ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పనుల ను గురువారం కలెక్టర్ మయాంక్ సింగ్ పరిశీలించారు. గురువా రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈవో కార్యాలయం వద్ద దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూఎస్, వైద్య, ఇరిగేషన్, విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ తదిత ర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మే నెల 15 నుండి 26 వ తేదీ వరకు కాళేశ్వరం లో జరుగు సరస్వతీ పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని, పుష్కరాల అభివృ ద్ధి పనులు వెంటనే సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, దేవస్థానం ఈవో ఎస్ మహేష్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment