ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభం

ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభం

ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభం

కరీంనగర్, జూన్19, తెలంగాణ జ్యోతి : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రం లోని శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా మల్కాపూర్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, సంబంధిత కోర్సులలో చేరే అంధులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఎన్. భాస్కర్ తెలిపారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, అలాగే 1వ నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో బోధన ఉంటుందన్నారు. పాఠశాలలో చేరే విద్యార్థులకు విద్యతో పాటు భోజన వసతి ఉంటుందన్నారు. అంతేగాక విద్యుత్ తో పాటు ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో రూపొందించిన కంప్యూటర్ శిక్షణ, వివిధ కళల్లో శిక్షణ ఇస్తామన్నారు. ఈ పాఠశాలల్లో చేరుటకు 6 నుంచి 14 సంవత్సరంల మధ్య వయసు కలిగి ఉండాలని జిల్లా మెడికల్ బోర్డుచే జారీ చేయబడిన సదరం సర్టిఫికెట్ (40 నుంచి 100 శాతం అంధత్వం) కలిగిన బాల బాలికలు అర్హులుగా పేర్కొన్నారు. అంధ బాలబాలికలను వారి తల్లిదండ్రులే కాకుండా సంరక్షకులు, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, స్వచ్ఛంద సంస్థలు అర్హులైన అంధులను పాఠశాల చేర్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. ఇతర వివరములకు ఈ నెంబర్లకు 9440550345, 9701190124, 9700457939, 9440338424 వాట్సాప్ ద్వారా సదరం, ఆధార్ కార్డు, యూడిఐడి కార్డు కాంటాక్ట్ నెంబర్స్ పంపవలసిందిగా కోరారు

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment

Footer Content