మంత్రి శ్రీధర్ బాబును కలిసిన అడిషనల్ ఎస్పీ నరేష్
కాటారం, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి అదనపు ఎస్పీ గా ఏ నరేష్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కాటారం మండలం ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అంద జేశారు. జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణలో కఠినంగా వ్యవహ రించాలని, నిబంధనల మేరకు నడుచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు అడిషనల్ ఎస్పీ నరేష్ కు సూచించారు.
భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీగా ఏ. నరేష్ కుమార్
భూపాలపల్లి అదనపు ఎస్పీ గా ఏ. నరేష్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. పోలిసు శాఖలో 1991 సంవత్స రంలో ఎస్సైగా ఎంపికయిన అదనపు ఎస్పీ నరేష్ కుమార్, మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్,రాయకల్ , కోరుట్ల, వేములవాడ, కరీంనగర్ రూరల్ లో ఎస్సైగా విధులు నిర్వహించి, 2006 లో సీఐగా పదోన్నతి పొంది, సీఐడి వరం గల్, టేకులపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, జగిత్యాల, ఖానాపూర్ సీఐ గా విధులు నిర్వర్తిస్తూ, 2017 లో డిఎస్పీ గా పదోన్నతి పొంది, మహబూబాబాద్, మామునూర్ ఏసిపి గా విధులు నిర్వర్తిస్తూ, 2023 లో అదనపు ఎస్పిగా ప్రమోషన్ పొంది, ఖమ్మం పోలీసు కమిషనరేట్ లో అదనపు డీసీపీ అడ్మిన్ గా విధులు నిర్వర్తిస్తూ, భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా బదిలీపై రావడం జరిగింది. అదనపు ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన ఏ. నరేష్ కుమార్ జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, ప్రజల రక్షణ కోసం సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.