మావోయిస్టు బంద్ పిలుపు నేపథ్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు. 

మావోయిస్టు బంద్ పిలుపు నేపథ్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు ,పేరూరు‌ , వెంకటాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదా రులపై,ఆయా పి.ఎస్ పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. మావోయిస్టు లు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపద్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన, వెంకటాపురం పోలీస్ సర్కిల్లో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశంపై రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు మావో యిస్టులు ఏదో ఒక ప్రాంతంలో,దుశ్చర్యలు కు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్సీ రిపోర్టుతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. అదనపు బలగాలతో అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ లు నిర్వహించారు. వెంకటాపురం చర్ల రహదారి విజయ పురి కాలనీ వద్ద కొత్తపల్లి క్రాస్ రోడ్ సమీపంలో వెంకటాపురం సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్. అశోక్ విస్తృతంగా వాహనాలను తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వాజేడు పి.ఎస్ పరిధిలోని ప్రధాన రహదారులపై వాజేడు సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు విస్తృతంగా వాహనాలు తనిఖీల కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే పోయే వాహనాల ను తనిఖీలు నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు.ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్ల సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “మావోయిస్టు బంద్ పిలుపు నేపథ్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు. ”

Leave a comment