వైద్యసేవల్లో సిబ్బంది కీలకంగా వ్యవహరించాలి

On: December 2, 2025 4:07 PM

వైద్యసేవల్లో సిబ్బంది కీలకంగా వ్యవహరించాలి

వైద్యసేవల్లో సిబ్బంది కీలకంగా వ్యవహరించాలి

– ఎన్​సీడీ ప్రోగ్రాం ఆఫీసర్​ డాక్టర్​ పోరిక రవీందర్​

– ఉత్తమ సేవలందించిన బొల్లికుంట ఏఎన్​ఎంకు అభినందనలు

వరంగల్​, డిసెంబర్ 2, తెలంగాణ జ్యోతి : ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో సిబ్బంది కీలకంగా వ్యవహరించాలని ఎన్​సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్​ పోరిక రవీందర్​ పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ జిల్లా పైడిపల్లి పీహెచ్​సీ పరిధిలోని బొల్లికుంట సబ్​ సెంటర్ ను సందర్శించిన ఆయన రోగులకు అందించిన వైద్యసేవల గురించి పరిశీలించారు. 2025–26 స్క్రీనింగ్​ లో నవంబర్​ నెలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏఎన్​ఎం పూర్ణను అభినందించిన డాక్టర్​ రవీందర్​ నాయక్​ తన సాలరీ నుంచి రూ.3వేలు ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యరంగంలో సేవ చేయడం ఇష్టదైవాలకు సేవ చేసినట్లేనన్నారు. ప్రతీ ఒక్క సిబ్బంది ఆదర్శకంగా నిలవాలని సూచించారు. రోగులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. అదేవిధంగా మార్చి నెలాఖరులో ఎన్​సీడీ స్క్రీనింగ్​ లో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబర్చుతారో వారికి సైతం ప్రోత్సాహక బహుతమతులు సొంతంగా అందజేస్తానని డాక్టర్​ రవీంరద్​ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్​సీ వైద్యాధికారి జులైద్ ఖాన్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వైద్యసేవల్లో సిబ్బంది కీలకంగా వ్యవహరించాలి

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!