సరైన పత్రాలతో సీజ్ చేసిన వాహనాలు తీసుకెళ్లండి
– జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
కాటారం, జూన్ 30, తెలంగాణ జ్యోతి : జిల్లాలోని వివిధ కేసుల్లో పోలీసు స్టేషన్లలో సీజింగ్ లో ఉన్న 182 వాహనాలను, వెహికల్ కు సంబంధించి సరైన పత్రాలు, ఆధార్ కార్డు చూపించి వాహన యజమానులు తీసుకెళ్లాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్ పత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో అందజేసి వాహనాలను తీసుకెళ్లాలని, వాహనాల జాబితా జిల్లా పోలీస్ వెబ్సైట్, ట్విట్టర్, లేదా ఎక్స్, ఫేస్ బుక్. లో పోస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. 6 నెలల లోపు తీసుకెళ్లకుంటే వేలం నిర్వహించనున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు.
బాధితుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
అనేక రకాల సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 26 మంది పిర్యాదుదారులతో ఎస్పీ కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ నడవ డానికి ఇబ్బంది పడుతున్న ఫిజికల్లి ఛాలెంజ్ పర్సన్ దగ్గరకు స్వయంగా వెళ్ళి ఆయన సమస్య తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజాదివాస్ లో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు, పెండింగులో లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
సదానందం సేవలు స్పూర్తి దాయకం
పోలీసు శాఖలో 42 ఏళ్లు సేవలు అందించి, సోమవారం పదవి విరమణ పొందిన ఆర్ ఎస్ ఐ కే. సదానందం సేవలు స్పూర్తి దాయకమని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పదవి విరమణ పొందిన సదానందం ను ఎస్పీ శాలువా, పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. విజయ వంతంగా సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు. పదవీవిరమణ అనంతరం ఎలాంటి సమస్యలు ఎదురయినా తనను సంప్రదించవచ్చని అన్నారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురా రోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ. ఏ. నరేష్ కుమార్, రిజర్వు ఇన్స్పెక్టర్ లు నగేష్, రత్నం, శ్రీకాంత్, పోలీసు అధికారుల నేత యాది రెడ్డి, పదవి విరమణ పొందిన సదానందం కుటుంబ సబ్యులు పాల్గొన్నారు.