మోసాలతో కాలం గడుపుతున్న మంత్రి శ్రీధర్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే

మోసాలతో కాలం గడుపుతున్న మంత్రి శ్రీధర్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే

మోసాలతో కాలం గడుపుతున్న మంత్రి శ్రీధర్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే

– ప్రజాసేవకు మారుపేరు పుట్ట మధుకర్

కాటారం, జూన్ 30, తెలంగాణ జ్యోతి : మోసాలతో కాలం గడుపుతున్న మంత్రి శ్రీధర్ బాబు కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందేనని కాటారం మండల బిఆర్ఎస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ నాయకులు నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తీరును కాటారం మండల బి ఆర్ ఎస్ ఇంచార్జ్ జోడు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. మంథని నియోజకవర్గంలో సేవ అంటే మదన్న, మదన్న అంటే సేవ, అలాంటి నాయకుడిని ఎంత పడితే అంత స్థాయిని మరిచి మాట్లాడితే మేము కూడా మీనాయకుని పట్ల అలాగే వ్యవహ రిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చ కుండా ఇచ్చిన మాట పై కట్టుబడని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. హామీల అమలు కోసం ప్రశ్నించకుండా ఈ సమాజాన్ని నియోజకవర్గ ప్రజలను మేనేజ్ చేస్తున్న, కార్యకర్తలు పదవులు కావాలని అడగకుండా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంచుతూ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా తమరు ఇచ్చిన హామీలు ఎప్పుడూ నెరవేరుస్తారని ప్రజలు అడగకుండా ఈ సమాజానంతటిని మభ్యపెడుతూ, హామీలను ఎగ్గొడుతూ ప్రజలను మోసం చేయడంలో సఫలీకృ తుడైండు కాబట్టి ఆయనకు తప్పకుండా ఆస్కార్ అవార్డు ఇయ్యాల్సిందే అని దుయ్యబట్టారు, నాయకులు అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఇసుక లారీలు బంద్ చేస్తాం అని ప్రగల్బాల్ పలికి నేడు యదేచ్చగా 24 గంటలు ఇసుక దోపిడిని చేస్తూ కోట్లు గడిస్తున్నారు అంటూ విమర్శించారు, గెలిచిన సంవత్సరంలోపే చిన్న కాలేశ్వరం పూర్తిచేసి చెరువులకు పొలాలకు నీళ్లు అందిస్తానని చెప్పి ఇచ్చిన హామీను తుంగలో తొక్కినాడని ఎద్దేవా చేశాడు. మీ నాయకుని వద్ద మెప్పుకోసం రేపు ఇచ్చే పదవుల కోసం విలువలు కోల్పోయే విధంగా మాట్లాడకండి అని, అంబటి పెళ్లి లో ప్రమాదవశాత్తు చనిపోయి న దళిత యువకుల కుటుంబాలకు ఏ విధమైన న్యాయం చేశాడు, ఈ ఎమ్మెల్యే నటిస్తూ కాలం గడుపుతున్నాడు కాబట్టి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అన్నారు, నియోజకవర్గంలో తండ్రి కొడుకులు కలిసి 40 సంవత్సరాల నుంచి ఏలిన అభివృద్ధి ఏది అని ఎద్దేవా చేశారు, కనీసం కాటారం మండలా నికి బస్టాండ్ కూడా ఏర్పాటు చేయలేకపోయారు తండ్రి కొడుకుల పాలనలో, అలాంటి వ్యక్తుల కింద పని చేసే కాంగ్రెస్ నాయకులు మా నాయకుడిని విమర్శించడమా సిగ్గు సిగ్గు అంటూ, మా నాయకుడు చేసిన పనుల గురించి మరొకసారి విమర్శిస్తే బాగుండదని, ప్రభుత్వం ద్వారా చేసే పనులే కాకుండా తన సొంతగా ఎన్నో సేవలు చేశారని, 250 మంది ఆడబిడ్డలకు తన సొంత ఖర్చుతో అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేశాడని, అలాగే కరోనా టైంలో కూడా చనిపోయిన శవాళను దగ్గర ఉండి దహనం చేయించారని, కాళ్లు లేని వారికి కాళ్లు నడవలేని వారికి సైకిళ్ళు స్కూటర్లు ఇప్పించాడని, మా నాయకునికి మీ నాయకునికి అసలు పోలికే ఉండదని మరొకసారి మా నాయకు డిని విమర్శించేముందు ఆలోచించి మాట్లాడండి అని హితవు పలికాడు, ఈకార్యక్రమంలో మండల బిఆర్ఎస్ ఇన్చార్జి జోడు శ్రీనివాస్,తొంబర్ల వెంకటరమణ, జక్కు శ్రవణ్, మందల లక్ష్మారెడ్డి ,కొండ గొర్ల వెంకటస్వామి, అజ్మీర దేవ, మానెం రాజబాపు, గంట శ్రావణ్ ,గాలి సడవలి , కొండపర్తి రవి,లక్ష్మన్న, మాదాసు మొండి, కాటారం రాజమౌళి, జాగిరి ఓదేలు, వంగల రాజేంద్ర చారి, బోడ తిరుపతి, ముంత బాపు, ఆడెపు రమేష్, గంట సమ్మయ్య, రజాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment