స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ లో ప్రజలు భాగస్వాములు కావాలి

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ లో ప్రజలు భాగస్వాములు కావాలి

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ లో ప్రజలు భాగస్వాములు కావాలి

– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, జూన్ 30 ,తెలంగాణ జ్యోతి : స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ ఎస్ జి) 2025 లో ప్రతి ఒక్కరు భాగస్వాములై గ్రామాల స్వచ్ఛతలో ముందుండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. సోమవారం ఐడిఓసి కార్యాల యంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025 (ఎస్ ఎస్ జి 2025) కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి “ఒక అడుగు స్వచ్ఛత వైపు” అనే నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రత, పారిశుధ్యంపై అవగా హన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రజలు యాప్ డౌన్లోడ్ చేసుకుని గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాల పరిస్థితులపై అభిప్రాయాలను తెలియ చేయవచ్చని పేర్కొన్నారు. ఇది గ్రామాల్లో శుభ్రతకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో ప్రధానంగా ఉపయోగ పడుతుందని అన్నారు. ప్రతి గ్రామ ప్రజలు ముందుకొచ్చి తమ గ్రామాన్ని మోడల్ స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. మీ అభిప్రాయమే మీ గ్రామ భవిష్యత్‌ను మారుస్తుందని, స్వచ్ఛతను అలవాటు చేసుకుని, ఆరోగ్యకరమైన జీవనాన్ని ముందుకు తీసుకెళ్లడంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్పష్టం చేశారు.

ప్రజావాణి విజ్ఞప్తులను పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన వినతుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతుల సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి, పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 57 దరఖాస్తులు అందాయనీ, వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలు వ్యక్తపరిచిన సమస్యలను సున్నితంగా తీసుకుని, పెండింగ్‌లో ఉంచకుండా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

చెల్పూర్ మిల్లెట్స్ విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలి

చెల్పూర్ మిల్లెట్స్ విక్రయాలు నిర్వహణకు ఐడిఓసి కార్యాలయంలో క్యాబిన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ డిఆర్డీఓకు సూచించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో చెల్పూర్ మిల్లెట్ యూనిట్ నిర్వహి స్తున్న మహిళలతో కలెక్టర్ ముకాముఖీ అయ్యారు. నేటి ప్రజల దైనందిన జీవనశైలిలో మిల్లెట్స్ వినియోగం ఆరోగ్య పరంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు. అందుకే చెల్పూర్ మిల్లెట్ యూనిట్ ద్వారా తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణ అవసరమున్నదని, ఇందుకోసం ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయంలో మిల్లెట్ క్యాబిన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిఆర్డిఓ బాలకృష్ణ, ఆర్డిఓ రవి, ఎస్బిఎం కన్స్ ల్టెంట్స్ భాస్కర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment