కపట నాటకాలతో తప్పిదాలను కప్పిపుచ్చే ప్రయత్నం
కాటారం, జూన్ 29,తెలంగాణ జ్యోతి : మంథని బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధు చేసిన తప్పిదాలను కప్పి కప్పిపుచ్చు కోవడానికి కపట నాటకాలు ఆడుతున్నారని కాటారం మండలం కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఆదివారం కాటారం వై టి సి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. నియోజకవర్గంలో దళితులంతా శ్రీధర్ బాబు వెన్నంటి ఉన్నారని హైదరాబాదు నుంచి రాష్ట్ర దళిత నాయకులు వచ్చి శ్రీధర్ బాబు గొప్పతనాన్ని సేవలను కొనియాడారని అన్నారు. పుట్ట మధు ప్రెస్ మీట్ లో శ్రీధర్ బాబు కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చేసిన నిరాధారమైన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో జరిగిన హత్యలు దోపిడీలు దొంగతనాలన్నీ చారిత్రక ఘట్టాలని పుట్ట మధు పేర్కొనడాన్ని తీవ్రంగా అభిశంసించారు. శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల చాలా గౌరవంగా ప్రేమ తో ఉన్నారని వారి అవసరాలను పనులను స్వేచ్ఛగా చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి పట్ల పూర్తి అవగాహన కలిగి పనులు చేస్తున్నారని ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫిర్యాదు చేయకున్నా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో తలదూర్చి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా తీయబట్టారు. గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలవరుస్తుందని సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉందని సీనియర్ అడ్వకేట్ల అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. చేసిన తప్పిదాలను, మోసాలను, దోపిడీలను, అన్యాయాలను, హత్యలను కప్పి పుచ్చుకోవడానికి కపట నాటకాలు ఆడుతున్నారని ఇవి మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో మీ పాత్ర ఏంటని? మీ పార్టీ వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకోవాలని హితపు పలికారు. పుట్ట మధు ఆరోపణలు మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరిచినట్లు ఉందని వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా పోయిన పరువు దక్కించుకోవాలని ప్రజలను తప్పుదోవ పట్టించి గెలుపొందాలని కుట్రలు పన్నుతున్నారని,అందుకొరకు ప్రజలనే దోషులుగా చిత్రీకరించడానికి కూడా వెనుకడడం లేదని తీవ్రంగా విమర్శించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని లేనియెడల రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య,నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్,మండల కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు గద్య సమ్మిరెడ్డి, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, మాజీ సర్పంచ్ అజ్మీర రఘురాం, నాయకులు కొట్టే ప్రభాకర్, కొట్టే శ్రీహరి, నాయిని శ్రీనివాస్, మంత్రి మధు, కుమార్ యాదవ్, కుమ్మరి రమేష్, మాజీ కోఆప్షన్ సభ్యుడు అజీజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాదా మియా, చీమల సత్యం,మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.