పార్కు ప్రారంభం, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
– మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
మహాదేవపూర్, జూన్ 27, తెలంగాణ జ్యోతి : చిన్నారులకు స్వాంతన చేకూర్చాలని ఉద్దేశంతో పార్కును ప్రారంభిస్తున్నా మని, అలాగే దివ్యాంగులకు ఉపకారణాలను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహా రాలశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురంలో దుద్దిల్ల శ్రీపాదరావు స్మారక కార్యాలయాల సముదాయంలో గల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పార్కును ప్రారంభించిన అనంతరం అంగన్వాడీ కార్యాలయం ఆవరణలో దివ్యాంగుల ఉపకరణాలను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ మాయాoక్ సింగ్ లతో కలిసి పంపిణీ చేశారు. దివ్యాంగులకు ఇల్లు ఇప్పించే కార్యక్రమాన్ని సైతం చేపట్టామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సి ఎస్ ఆర్ లో భాగంగా మహాదేవపూర్ లో ఏర్పాటు చేసిన పార్కు చిన్నారులు వినోదానికి ఉపయోగించే పరికరాలు ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి రాధిక, తాసిల్దార్, ఎంపీడీవో, అధికారులతో పాటు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోట రాజబాబు గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్, సింగిల్ విండో చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, మాజీ చైర్మన్ వాహనరావు, గుడాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, దహగం సంతోష్, తన్నీరు రాఘవేంద్ర, చిటికేసి చక్రధర్, మహాదేవపూర్, కాలేశ్వరం, పలిమెల మండలాల నాయకులు పాల్గొన్నారు. కాటారం డిఎస్పి సూర్యనారాయణ, మహాదేవపూర్, కాటారం సిఐలు రామచంద్రం, నాగార్జున రావు, మహాదేవపూర్, పలిమల, కాలేశ్వరం, మహా ముత్తారం ఎస్సైలు కుడిక్యాల పవన్ కుమార్, జిలుగుల రమేష్, తమాషా రెడ్డి, సుధాకర్ తదితరులు బందోబస్తు నిర్వహించారు.