తాడ్వాయి రిపోర్టర్‌పై దాడిని ఖండించిన వెంకటాపురం జర్నలిస్టులు

తాడ్వాయి రిపోర్టర్‌పై దాడిని ఖండించిన వెంకటాపురం జర్నలిస్టులు

తాడ్వాయి రిపోర్టర్‌పై దాడిని ఖండించిన వెంకటాపురం జర్నలిస్టులు

– తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

వెంకటాపురం, జూన్ 25, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేఖరి చల్లగొండ శ్రీకాంత్ రెడ్డి పై కొంతమంది దుండగులు దాడి చేసిన ఘటనను నూగూరు వెంకటాపురం ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు బుధవారం జరిగిన సమావేశంలో తీవ్రంగా ఖండించారు. అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చే పాత్రికేయులపై రాజకీయ పార్టీల ముసుగులో ఉన్న రౌడీల దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడులు నివారించేందుకు ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక అతిథి గృహం నుండి నిరసన ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్టులు బాచినేని ప్రవీణ్ కుమార్, కలకోట సంతోష్ కుమార్, ఎస్. సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, హరికృష్ణ, అశోక్, సమ్మయ్య, కే. ప్రసాద్, గోపి, రాజు, రవి, ముత్తినేని, వాసం నాగరాజు, భాస్కర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment