ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాల పంపిణీ

ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాల పంపిణీ

ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాల పంపిణీ

వెంకటాపురం, నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం విఆర్‌కేపురం గ్రామ పంచాయతీ లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల నమూనా ప్రకారం ప్రతి ఇంటి నిర్మాణం కోసం 400 గజాల స్థలాన్ని కేటాయించా రని అధికారులు తెలిపారు. లబ్ధిదారులు 3 నెలల వ్యవధిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేందర్ లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనలపై అవగాహన కల్పించారు. గ్రామ సెక్రటరీ ఆధ్వర్యంలో పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకుడు డర్రా రవి మాట్లాడుతూ సకాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు బిల్లులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడించారు. అలాగే గ్రూప్ సంఘాల ద్వారా లబ్ధిదారులకు లక్ష రూపాయల వడ్డీ లేని రుణాన్ని ప్రభుత్వం అందించనుందన్నారు. పేదల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి దారులు త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాల న్నారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment