మహిళా సంఘాలను బలోపేతం చేయడమే ప్రభుత్వం లక్ష్యం

మహిళా సంఘాలను బలోపేతం చేయడమే ప్రభుత్వం లక్ష్యం

మహిళా సంఘాలను బలోపేతం చేయడమే ప్రభుత్వం లక్ష్యం

– మహిళలు ఆర్థిక స్వావలంబన చెందాలి.

– జగ్గన్నపేట గ్రామంలో కుట్టుమిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో కుట్టు మిషన్లు, ధ్రువపత్రాల పంపిణీ.

మంత్రి ధనసరి సీతక్క.   

ములుగు ప్రతినిధి, జూన్ 19, తెలంగాణ జ్యోతి : మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి,  గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామం ఆశ్రమ జూనియర్ కళాశాల ప్రాంగణం లో కుట్టు మిషన్ ఉచిత శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్, ధ్రువపత్రాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ చాలా మంది నైపుణ్యం లేని కారణంగా ఉపాధికి దూరంగా ఉంటున్నారని, దూర ప్రాంతాలకు పనికోసం వెళ్ళి మళ్ళీ ఇంటికి వెనుతిరిగి వస్తున్నారని, ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మహిళలు ఉన్నదగ్గరనే ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో వారికి ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళల అభివృద్ధి కొరకు కట్టుబడి పనిచేస్తున్నదని అన్నారు. వివిధ పాఠశాలల్లో అవసరమైన మేరకు ఏకరూప దుస్తులను మహిళా సంఘాలకు ఆర్డర్ ఇచ్చి వారి ద్వారా విధ్యార్థులకు బట్టలు కుట్టించడం ద్వారా మహిళా సంఘాలకు దాదాపు 30 కోట్ల రూపాయల లాభం వారికి చేకూర్చడం జరిగినదని తెలిపారు. భవిష్యత్తు లో రాబోయే విద్యాసంస్థలలోని పిల్లలకు కూడా మహిళా సంఘాల ద్వారానే బట్టలు కుట్టేలా వారికి ఆర్డర్ లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.15 సం.ల నుండి 60 సం.ల లోపు వయస్సున్న మహిళలు అందరూ తప్పకుండా మహిళా సంఘాలలో చేరాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ లు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, బస్సులు, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవకాశాలను అందించడం జరుగుతుందని అన్నారు. మహిళలు ప్రభుత్వ సహకారాన్ని వినియోగించుకొని ఉన్నతంగా ఎదగాలని, తద్వారా తెలంగాణ ప్రగతి పథంలో నడిచేలా మనమంతా ముందడుగు వేద్దామని అభిలషించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేసే ఉద్దేశ్యంతో మంత్రివర్యులు ప్రత్యేక చొరవతో జగ్గన్నపేట గ్రామంలో వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా శిక్షణతో పాటు ఉపాధి కల్పించినప్పుడు మాత్రమే అది సార్థకం అవుతుంది. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఇంతటితోనే ఆగిపోకుండా వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకొని ప్రతిభావంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నెలవారీ ఆదాయం కూడా చేకూరేలా చూసి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయడం జరుగుతున్నదని ఇప్పటికే 3 కంపెనీలతో మాట్లాడటం జరిగిందని వివరిం చారు. ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా సంక్షేమ అధికారి తుల రవి గారు మాట్లాడుతూ జిల్లాలో మంత్రివర్యులు ధనుసరి అనసూయ సీతక్క చొరవతో జగ్గన్నపేట గ్రామంలో మహిళాభి వృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జిల్లా మహిళా సాధికారత కేంద్రం ములుగు ఆధ్వర్యంలో డేటా ప్రో సంస్థ శిక్షణ సహకారంతో గత నెల రోజులుగా గ్రామంలోని అర్హులైన 175 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ అందించడం జరిగినదని అన్నారు.జిల్లా కలెక్టర్ అనునిత్యం మమ్మల్ని వెన్నంటి నడిపి ఈ కార్యక్రమం విజయవంతం చేసేలా ప్రోత్సహించారని అన్నారు.  అనంతరం డేటాప్రో సంస్థ నిర్వాహకులు రవీందర్ మాట్లాడుతూ మంత్రివర్యులు సీతక్క ప్రత్యేక చొరవతో ఇంతటి భారీ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా మహిళా సాధికారతా కేంద్రం ములుగు నేతృత్వం లో మా డేటాప్రో సంస్థ ద్వారా విజయవంతము గా ఇట్టి కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మంత్రికి, జిల్లా కలెక్టర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం లబ్దిదారులకు మొదటి విడతగా 75 కుట్టు మిషన్ లను మంత్రి అందచేశారు. అనంతరం ఐ సి డి సి ఎస్ ములుగు ప్రాజెక్టు సిడిపిఓ శిరీష ఆధ్వర్యంలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమం లో భాగంగా స్థానిక అంగన్వాడీ కేంద్రం లో చేరిన చిన్నారులకు మంత్రి సీతక్క , కలెక్టర్ లు అక్షరాభ్యాసం చేశారు. పిల్లలు మంత్రి సమక్షంలో ఎంతో ఉల్లాసంగా పాటలు పాడి వినిపించారు. పిల్లల ఉత్సాహాన్ని చూసి మన అంగన్వాడీ పిల్లలు కార్పోరేట్ కు ధీటుగా ఉత్సాహంగా చదవడం ఎంతో సంతోషంగా ఉందని సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమాధికారి తుల రవి, డి ఎస్ పి రవీందర్, ట్రైబల్ వెల్ఫేర్డి డి పోచం, ఎం పి డి రామక్రిష్ణ, జిల్లా మహిళా సాధికారతా కేంద్రం (డి హెచ్ ఈ డబ్ల్యు) డి ఎం సి రమాదేవి, బి సి పి ఓ ఓంకార్, ఐసిడిఎస్ ములుగు ప్రాజెక్టు పరిధిలోని వివిధ సెక్టార్ల సూపర్వైజర్లు, జిల్లా మహిళా సాధికారతా కేంద్రం, డిసిపియు, సి హెచ్ ఎల్, సఖి, డేటాప్రో సంస్థల సిబ్బంది, శిక్షణ లో పాల్గొన్న మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మహిళా సంఘాలను బలోపేతం చేయడమే ప్రభుత్వం లక్ష్యం

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment

Footer Content